Saturday, May 14, 2011

నా హుబ్లి యాత్ర 2

                             లేఖిని గురించి చెప్పిన జ్యోతి గారికి ముందుగా నెనర్లు. అమ్మ స్పెల్లింగ్స్ చెప్తుంటే లేఖినితో ఇదంతా నేనే టైప్ చేసాను.

  హుబ్లి లో ఉండగా మురుడేశ్వర్ లోని శివాలయాన్ని దర్శించుకున్నాము. రావణాసురుడు ఆత్మలింగాన్ని సంపాదించి లంకకు తీసుకొని వెళ్తూంటే వినాయకుదు తెలివిగా లింగాన్ని కింద పెట్టేస్తాడు. కోపంతో రావణుడు పెకలించేసరికి లింగం అడుగుభాగం గోకర్ణంలో ఉండిపోతుంది. ఒక భాగం మురుడేశ్వర్ లో ఇంకొక భాగం దగ్గరలోని మరొక ప్రదేశంలో పడిపోయాయి.

గుడి  వెనుక , సముద్రం పక్కన ఉన్న హొటెల్ లో ఐదో అంతస్తులో  గది దొరికింది. .అక్కడి నుంచి  కిందికి చూస్తే  ...... అదుర్స్! మధ్యాహ్నం సముద్రం ఒడ్డుకి వెళ్ళి భలేగ ఆడుకున్నాము .కల్యాణ్ మామ ,వరలక్ష్మి అత్త , శ్రీముఖి , అమ్మ , నేను వాటర్ స్కూటింగ్ , స్పీడ్ బోటింగ్ చేశాము . ఒంటె  ఎక్కాము. నీళ్ళల్లో బా........గా  ఆడుకున్నాము  .
       సాయంత్రం  గుడికి వెళ్ళాము .కరెంటు పోయినప్పుడు చందమామ వెలుగులో అలలు ప్రాకారాన్ని తాకుతుంటే హాయిగా అనిపించింది . మరుసటి రోజు స్లైడ్ పూల్ , వేవ్ పూల్ లో  ఆడుకొని దగ్గరలోని   పెద్ద శివుడి కింద ఉన్న మ్యూజియం   చూశాము. రావణాసురుడు ఆత్మలింగాన్ని సంపాదించి పోగొట్టుకున్న కథ బొమ్మలతో అక్కడ చూపించారు. తరువాత హోటెల్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో శ్రీముఖి, నేను ఆడుకొని ట్రిప్ అయిపోయిందే అని బాధపడుతూ తిరిగి బయలుదేరాము. అక్కడి నుంచి మూకాంబిక అమ్మవారిని, గోకర్ణంలోని శివాలయాన్ని దర్శించుకొని హుబ్లీ వెళ్ళిపోయాము.

  నోట్ :   వచ్చే టపాలో పక్షిధామ గురించి చెప్తాను. ఈ క్రింది స్లైడ్ షో చూడండి.